విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండల కేంద్రంలో ఓ యువకుడిని జీపులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కొట్టి పడేశారు. అనంతరం అక్కడి నుంచి వారు పరారయ్యారు. గమనించిన స్థానికులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. గత నెల మావోయిస్టు చేతిలో హతమైన రంగారావు బంధువులు ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు కొట్టి పారేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకునిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - latest crime news in visakha agency
విశాఖ ఏజెన్సీ జి మాడుగులలో ఓ యువకునిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకునిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి