ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్​ఫోన్ దుకాణదారుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి సెల్​ఫోన్ దుకాణ యజమానిపై దాడి చేసిన ఘటన పాయకరావుపేటలో జరిగింది.​ ఇనుప రాడ్డుతో దాడి చేయడం వల్ల సాంబశివరావు తలకు బలంగా దెబ్బ తగిలింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు.

By

Published : Jun 7, 2020, 12:33 PM IST

unknown person atacked on cellphone shop owner in payakaraopeta mandal
గుర్తు తెలియని వ్యక్తి దాడిలో సాంబశివరావు తలకు బలమైన గాయం

సెల్​ఫోన్ దుకాణం నిర్వాహకునిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగింది. పట్టణంలో స్థానిక పాండురంగ స్వామి దేవస్థానం దుకాణ సముదాయం వద్ద పెంటకోట గ్రామానికి చెందిన సాంబశివరావు సెల్​ఫోన్​ దుకాణం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఇనుప రాడుతో దాడి చేసి పరారయ్యాడు. దీంతో సాంబశివరావు తలకు తీవ్ర గాయం అయింది. బాధితుడిని పాయకరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details