ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 18, 2020, 9:15 AM IST

ETV Bharat / state

అంతుచిక్కని వ్యాధితో గిరిజనులు బెంబేలు

విశాఖపట్నం జిల్లా కరకవలసలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన 20 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరు విజయనగరం జిల్లాలోని గజపతినగరం ఆస్పత్రిలో చేరారు.

unknown Disease in karakavalasa vishakhapatnam district
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం కరకవలస గ్రామానికి చెందిన 20 మంది గిరిజనులు అంతుచిక్కని వ్యాధితో విజయనగరం జిల్లా గజపతినగరం ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది రోజులుగా కాళ్ల వాపులు, చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. పరీక్షించిన వైద్యులు... వ్యాధి నిర్థరణ కోసం బాధితులను విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details