ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నైపుణ్యాభివృద్ధి శిక్షణలో ఎం​ఎస్​ఎం​ఈ కేంద్రాలు కీలకం'

By

Published : Mar 10, 2021, 2:10 PM IST

నైపుణ్యాభివృద్ధి శిక్షణలో ఎంఎస్​ఎం​ఈ కేంద్రాలు కీలకంగా వ్యవహరించనున్నాయని.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం పూడిలో ఎం​ఎస్​ఎం​ఈ సాంకేతిక కేంద్రాన్ని..ఆయన వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

union minister nitin gadkari inaugrates msme centre in vishaka virtually
'నైపుణ్యాభివృద్ధి శిక్షణలో ఎమ్​ఎస్​ఎమ్​ఈ కేంద్రాలు కీలకంగా వ్యవహరించనున్నాయి'

విశాఖ జిల్లా రాంబిల్లి మండలం పూడిలో ఎం​ఎస్​ఎం​ఈ సాంకేతిక కేంద్రాన్ని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణలో ఎం​ఎస్​ఎం​ఈ కేంద్రాలు కీలకంగా వ్యవహరించనున్నాయని అన్నారు. ఏటా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తులు ఈ కేంద్రాల్లో తయారు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశ్రమలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వీటి వల్ల ఏటా వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు సమకూరుతాయని అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి, అనకాపల్లి ఎంపీ సత్యవతి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details