ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమాయక గిరిజనులను హత్యచేశారు : మృతుల బంధువులు

పొట్ట కూటి కోసం వేటకు వెళ్లిన రైతులను పోలీసులు చంపేశారని మృతుల బంధువులు ఆరోపించారు. విశాఖ మన్యం కాల్పుల్లో మరణించిన ఇద్దరు వ్యక్తుల బంధువులు పాడేరు ఏరియా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.

By

Published : Mar 16, 2019, 8:09 PM IST

గిరిజనులు

విశాఖ మన్యం పెదకోడాపల్లి పంచాయతీ బురదమామిడిలో పోలీస్ కాల్పుల్లో మరణించిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారి బంధువులు పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. భూషణం, జమదర్ మృతదేహాలు శవపంచనామా కోసం పాడేరు ఆసుపత్రికి తరలించగా అక్కడకు చేరుకున్న బంధువులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమాయక గిరిజనులను హత్యచేశారని ఆవేదన చెందారు. అక్కడ నుంచి పాడేరు సబ్​కలెక్టర్ కార్యాలయంనకు ర్యాలీ వెళ్లి నిరసన వ్యక్తంచేశారు.

గిరిజనులు

ABOUT THE AUTHOR

...view details