ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి - సీఎం ఫ్లెక్సీలు కడుతుండగా ఇద్దరు వ్యక్తులు మృతి

ముఖ్యమంత్రి జగన్​ చిత్రాలతో రూపోందించిన ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.

Two people died while arranging CM jagan Flexi in anakapalli
ఫ్లెక్సీ

By

Published : Feb 28, 2020, 9:27 AM IST

సీఎం ఫ్లెక్సీలు కడుతుండగా ఇద్దరు వ్యక్తులు మృతి

అనకాపల్లిలోని శ్రీరామ్​నగర్ చెందిన ఏడిద జగదీష్ చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డితో కలిసి చదువుకున్నాడు. అప్పట్లో పాఠశాల తీసుకున్న ఫొటోలు, పాదయాత్ర సమయంలో జగన్​తో తీసుకున్న ఫొటోలతో ఫ్లెక్సీ బోర్డు తయారు చేయించాడు. ఇదే ప్రాంతానికి చెందిన ముప్పిడి శ్రీను, జగదీష్ ఇద్దరు కలిసి మేడపై ఆ ఫ్లెక్సీ కడుతుండగా ఇంటికి ఎదురుగా ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. వారి మృతితో ఇరు కుటుంబాలలో విషాదం నెలకొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details