ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2020, 7:52 PM IST

ETV Bharat / state

రెవెన్యూ అధికారులపై విచారణ చేపట్టాలి: చీమలపాడు గిరిజనులు

నర్సీపట్నం సబ్​కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ అధికారుల పనితీరుపై చీమలపాడు గిరిజనులు నిరసన చేపట్టారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తమ భూరికార్డులను మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tribal agitation
రెవెన్యూ అధికారులపై విచారణ చేపట్టాలి

విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్​కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చీమలపాడుకు చెందిన గిరిజనులు ఆందోళన చేపట్టారు. రోలుగుంట, రావికమతం మండల రెవెన్యూ అధికారులపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. భూమి యజమానుల ప్రమేయం లేకుండా వివిధ గ్రామాల్లో రైతుల రికార్డులను తారుమారు చేశారని వారు ఆరోపించారు.

అధికారుల నిర్లక్ష్యం, అవినీతితో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందున్న రహదారిపై బైఠాయించారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details