ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీరంలోని 9 ఎకరాల భూమికి సర్వే.. ప్రాజెక్టు చేతులు మారుతుందా? - Visakhapatnam-Bhimili Beach Road land survey

విశాఖపట్నం - భీమిలి బీచ్‌ రోడ్డులో తీరానికి అతి సమీపంలోని తొమ్మిది ఎకరాల భూమికి పర్యటక శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఒకటి రెండు రోజుల్లో బోరు వేయనున్నట్లు సమాచారం. ఈ స్థలాన్ని పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యం)కింద 2000 సంవత్సరంలో 33 ఏళ్లకు లీజుకు అప్పగించారు. 20 ఏళ్లుగా ఈ స్థలం నిరుపయోగంగా ఉంది. ఈ ప్రాజెక్టు చేతులు మారుతుందా? అనే అనుమానాలకు ఈ సర్వే తావిస్తోంది.

tourist department survey at 9 acres land at Visakhapatnam-Bhimili Beach Road
విశాఖపట్నం-భీమిలి బీచ్‌ రోడ్డు స్థలం సర్వే

By

Published : Nov 4, 2020, 12:51 PM IST

విశాఖపట్నం - భీమిలి బీచ్‌ రోడ్డులో తీరానికి అతి సమీపంలోని ఖాళీగా ఉన్న తొమ్మిది ఎకరాల స్థలానికి పర్యటక శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. సర్వే శాఖ సిబ్బందితో ఈ భూమికి సంబంధించిన కచ్చితమైన కొలతలు, హద్దులు వేస్తున్నారు. మట్టి పరీక్షల కోసం ఆ ప్రాంతంలోని కొన్ని చోట్ల నుంచి మట్టి నమూనాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ఒకటి రెండు రోజుల్లో బోరు వేయనున్నట్లు తెలిసింది.

రుషికొండ తీరానికి అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంతో పాటు దానికి ఆనుకొని కొండపైనున్న మరికొంత స్థలాన్ని పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యం)కింద 2000 సంవత్సరంలో 33 ఏళ్లకు లీజుకు అప్పగించారు. ప్రస్తుతం కొండపై ఆరోగ్య సంబంధ చికిత్సా సేవా కేంద్రాన్ని నిర్వహిస్తుంగా బీచ్‌ రోడ్డు పక్కన కేటాయించిన స్థలాన్ని ఏవిధంగా ఉపయోగించడం లేదు. 20 ఏళ్లుగా దాన్ని నిరుపయోగంగానే ఉంచారు. ఇటీవల ఈ ప్రాజెక్టు చేతులు మారుతుందన్న ఆరోపణలు రావడం, కొద్ది రోజులుగా సర్వే పనులు చేయడంతో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది.

పర్యటకశాఖకు చెందిన ఉన్నతాధికారులు గత వారం ఈ స్థలాన్ని పరిశీలించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ప్రాజెక్టు చేతుల మారే ప్రక్రియలో భాగంగా సర్వే చేయిస్తున్నారా, వేరొకరికి అప్పగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. లేకుంటే ఏళ్లుగా ఉపయోగించనందున వెనక్కి తీసుకొని ఏదైన కొత్త ప్రాజెక్టు కోసం వినియోగిస్తారా అనేది చూడాలి. ఈ స్థలం వ్యవహారంలో మాత్రం పర్యటకశాఖ అధికారులు గోప్యంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చదవండి:భాయ్‌ కుట్ర.. కూలీల పాలిట శాపం

ABOUT THE AUTHOR

...view details