విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు మండలంలో 214, మాడుగుల మండలంలో 162, దేవరాపల్లి మండలంలో 104, చీడికాడ మండలంలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నియోజకవర్గ కొవిడ్ ప్రత్యేకాధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత తెలిపారు. ఈ నేపథ్యంలో మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
మాడుగులలో కరోనా ఉద్ధృతి.. ఇప్పటివరకు 550 మందికి పాజిటివ్ - madugula latest news
విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఇప్పటివరకు 550 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు నియోజకవర్గ కొవిడ్ ప్రత్యేకాధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత తెలిపారు. కె.కోటపాడులో పర్యటించిన ఆమె మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత