ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 26, 2021, 11:16 AM IST

ETV Bharat / state

protest across Visakhapatnam agency: ప్రధానోపాధ్యాయుడిపై యువకుల దాడి.. విశాఖ ఏజెన్సీ బంద్

ప్రధానోపాధ్యాయుడిపై ఇద్దరు యువకులు దాడి చేశారని వివిధ సంఘాల నేతలు ఈరోజు విశాఖ ఏజెన్సీ బంద్(Visakhapatnam agency)కు పిలుపునిచ్చారు.

విశాఖ ఏజెన్సీ బంద్
విశాఖ ఏజెన్సీ బంద్

విశాఖ జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ ప్రధానోపాధ్యాయుడిపై ఇద్దరు యువకులు దాడి చేశారని వివిధ సంఘాల నేతలు ఈరోజు ఏజెన్సీ బంద్​కు(protest across Visakhapatnam agency) పిలుపునిచ్చారు. వ్యాపారులు పాడేరులో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. వేకువజాము నుంచి నిరసనకారులు బంద్​కు మద్దతుగా నినాదాలు చేశారు.

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాహనాల అడ్డగిస్తూ ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివాసి హక్కుల నేత రామారావు దొర తో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

రెండు రోజుల కిందట లోతుగడ్డ ప్రధానోపాధ్యాయునికి నర్సీపట్నానికి చెందిన ఇద్దరు యువకులతో వాగ్వాదం అయింది. ఈ నేపథ్యంలో ఇరువురూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు గాయపడటంతో విశాఖ ఏజెన్సీ బంద్​కు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:Kodali Nani criticized Chandrababu: చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కొడాలి నాని

ABOUT THE AUTHOR

...view details