విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధి సంగివలసలకు చెందిన బాలుడు గోస్గతనీనదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. గోస్తనీ నదిలో నలుగురు స్నేహితులు ఈత కోసం దిగారు. నది ప్రవాహానికి గుర్రాల హరీష్(10) అనే బాలుడు గల్లంతయ్యాడు. మిగిలిన స్నేహితులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం హరీష్ తల్లిదండ్రులు వీరిని నిలదీయడంతో గల్లంతైన విషయం బయటపడింది. రాత్రంతా వెదికినా ఫలితం లేకపోయింది. ఉదయం నదిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు
ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా యస్ రాయవరం మండలం లింగరాజు పాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన కంకిపాటి వీరన్న (41) చెరువులో కాళ్లు శుభ్రం చేసుకునేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలోపడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఈత గాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి వీరన్న మృతదేహాన్ని బయటకు తీశారు.