ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ జిల్లా రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయం పూర్తిస్థాయికి చేరుకుంది. జలాశయం గేట్లు ఎత్తివేత ద్వారా అదనపు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. తద్వారా లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా... శనివారం రాత్రికి 459.4 అడుగులకు చేరింది.
ప్రమాదకర స్థాయికి కల్యాణపులోవ - ప్రమాదకర స్థాయికి కల్యాణపులోవ జలాశయం
కురుస్తున్న వర్షాలకు కల్యాణపులోవ జలాశయం నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. జలాశయం పూర్తిగా నిండేందుకు కేవలం ఒక్క అడుగే తక్కువ ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 460 అడుగులు కాగా, శనివారం సాయంత్రానికి 459 అడుగులకు చేరుకుంది.
ప్రమాదకర స్థాయికి కల్యాణపులోవ
కల్యాణపులోవ జలాశయం పరివాహక ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గేట్ల ఎత్తివేత మరో రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మంచు తెరల అందం... నయనానందం