ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 31, 2020, 10:40 AM IST

Updated : Mar 31, 2020, 11:40 AM IST

ETV Bharat / state

మంత్రి, ఎమ్మెల్యేలకు ఆ నిబంధన వర్తించదా?

కరోనా వ్యాప్తి చెందకుండా స్వీయరక్షణ, సామాజిక దూరం పాటించడమే నివారణ అంటూ అధికారులు ప్రచారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నిబంధనను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

The people who attended the Chodaram House were huge
చోడవరం సభకు భారీగా హాజరైన ప్రజలు

చోడవరం సభకు భారీగా హాజరైన అధికారులు, సిబ్బంది

విశాఖ జిల్లా చోడవరంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కొవిడ్-19 పై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ డా.సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ , సంబంధిత అధికారులు, వైద్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓ ప్రైవేట్ కల్యాణ మండపం వేదికగా జరిగిన ఈ సభకు భారీ సంఖ్యలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమావేశ మందిరం చిన్నది కావడంతో సభకు వచ్చిన వారందరూ గుంపులుగా గుమికూడారు. ఫలితంగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్న సామాజిక దూరం అనే నిబంధనకు గండి పడినట్లయింది.

Last Updated : Mar 31, 2020, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details