విశాఖ జగన్నాథ స్వామి ఆలయంలో.. రథోత్సవం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.పూజారులు స్వామివారి కూర్మ అవతారం వెనుక ఉన్న కథలను భక్తులకు వివరించారు.
విశాఖలో వైభవంగా జగన్నాథ స్వామి రథోత్సవాలు - కూర్మ అవతారం
జగన్నాథ స్వామి రథోత్సవాలలో భాగంగా విశాఖ టర్నర్ చౌల్ట్రీ హాలులో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూర్మావతారంలో ఉన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తజనం