విశాఖ జిల్లా గిరిజన ప్రాంతంలో 2013 ఆగస్టులో గిరిజనుడిని సజీవ దహనం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు రెండో అదనపు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. విశాఖ మన్యంలోని డుంబ్రిగూడ మండలం ఒంబి గ్రామంలో చిల్లంగి (చేతబడి)అనుమానంతో... కిల్లో బొల్లి అనే వ్యక్తిని గొడ్డలితో నరికి... నాటు తుపాకితో కాల్చి... సజీవదహనం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు కిల్లో శంకరరావు, గెమ్మెలి సీతారాంకు జీవిత ఖైదు శిక్ష విధించింది.
గిరిజనుడి సజీవదహనం... నిందితులకు జీవితఖైదు - life imprisonment news in visakha
విశాఖ మన్యంలో 2013లో గిరిజనుడిని సజీవ దహనం చేశారు. ఈ కేసులో నిందితులకు... విశాఖ జిల్లా రెండో అదనపు సెషన్స్ కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది.
![గిరిజనుడి సజీవదహనం... నిందితులకు జీవితఖైదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4840519-92-4840519-1571806853317.jpg)
గిరిజనుడి సజీవదహనం