ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 18, 2020, 11:43 PM IST

ETV Bharat / state

మహిళా సాధికారతపై విద్యార్థినులతో వాసిరెడ్డి పద్మ ముఖాముకి

దిశ చట్టం అమలుపై కేంద్రానికి సమగ్ర వివరణ ఇచ్చామని.. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. విశాఖలో ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో మహిళా సాధికారతపై విద్యార్థినులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

The Center has given a comprehensive overview of the Direction Act: Vasireddy Padma
దిశ చట్టం అమలు పై కేంద్రానికి సమగ్ర వివరణ ఇచ్చాం: వాసిరెడ్డి పద్మ

మహిళా సాధికారతపై విద్యార్థులతో మహిళా కమిషన్​ ఛైర్​ పర్సన్​ ముఖాముఖి

రాష్ట్రానికి, దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండాలని దిశ చట్టం రూపొందించామని.. మహిళలపై నేరాలకు పాల్పడే వాళ్లు శిక్షల నుంచి తప్పించుకుంటూ చట్టానికి న్యాయానికి సవాలుగా మారారని మహిళా కమిషన్​ ఛైర్​ పర్సన్​ వాసిరెడ్డి పద్మ అన్నారు. విశాఖలో ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో మహిళా సాధికారతపై విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె పాల్గొన్నారు. దిశ చట్టం అమలుకు కృషి చేస్తున్న సీఎం జగన్​ను మహిళా లోకం అభినందిస్తుందని అన్నారు. ఈ చట్టం మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని పేర్కొన్నారు. దిశ చట్టంపై మగవారికి కూడా అవగాహన అవసరమని.. దిశ చట్టం అమలుపై కేంద్రం అభ్యంతరాలకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరణ ఇచ్చిందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, విద్యార్థినులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

శివరాత్రికి రోలుగుంట శివాలయం ముస్తాబు

ABOUT THE AUTHOR

...view details