ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 13, 2020, 4:12 PM IST

ETV Bharat / state

మెరుపులు చిలికిన చినుకులు ధారగా.. సింహాద్రి అప్పన్న మెట్లపై వాలగా

సింహాద్రి అప్పన్న ఆలయం వద్ద నీటి ధారలు కనువిందు చేస్తున్నాయి. దేవస్థాన వాతావరణమంతా ఆహ్లాదకరంగా ప్రకృతి శోభయమానంగా మారింది.

the-beauties-of-simhadri-appanna-temple
సింహాద్రి అప్పన్న మెట్లపై వాలగా

సింహాద్రి అప్పన్న మెట్లపై వాలగా

విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న మెట్ల మార్గంపై వర్షపు నీరు కనువిందు చేస్తోంది. ఆకాశ, గంగా, మాధవ, పిచ్చుక, కొల్లేటి ధారలు నీటితో పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. కరోనా కారణంగా దేవస్థానం అధికారులు, భక్తులకు అనుమతి ఇవ్వలేదు. వర్ష మేఘాలతో సింహగిరి అంతటా ఆహ్లాదకరంగా, ప్రకృతి శోభయమానంగా వీక్షకులను కనువిందు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details