ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2020, 9:52 AM IST

ETV Bharat / state

ఏయూలో నిర్మాణ, మరమ్మతు పనులకు టెండర్లు

రూ.12.14 కోట్ల అంచనా వ్యయంతో ఏయూలో నూతన నిర్మాణాలు, మరమ్మతులు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికల సిద్ధం చేశారు.

ఏయూలో నిర్మాణ, మరమ్మతు పనులకు టెండర్లు
ఏయూలో నిర్మాణ, మరమ్మతు పనులకు టెండర్లు

ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని వివిధ విభాగాలకు అవసరమైన కొన్ని అదనపు అంతస్తులను నిర్మించడంతోపాటు, ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న మరమ్మతులన్నింటినీ పూర్తి చేయాలని వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ఏయూ ఇంజినీర్‌ కార్యాలయ అధికారులు.. వర్సిటీలో ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేయాలన్న అంశాలు గుర్తించారు. 17 రకాల పనులను పూర్తిచేయాలని నిర్ణయించి.. శుక్రవారం టెండర్లను పిలిచారు. టెండర్ల అంచనా విలువ రూ.12.14కోట్లని తేల్చారు.

ABOUT THE AUTHOR

...view details