కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా యలమంచిలి రామాలయంలో చండీ హోమం నిర్వహించారు. కరోనా వైరస్ అంతరించి పోవాలని, దీని నుంచి ప్రజలకు ఎలాంటి నష్టం కలగకూడదని కోరుతూ వేదపండితులు ఈ హోమం నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ఆలయాల్లో ఈ యాగాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. స్థానిక వేద పాఠశాల విద్యార్థులు, భక్తులు సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కరోనా నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ హోమం - corona updates in vizag district
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణను కోరుతూ విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో హోమం నిర్వహించారు. వైరస్ అంతరించిపోవాలని కోరుతూ వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కరోనా నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ హోమం