ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 12, 2020, 9:47 PM IST

ETV Bharat / state

'గాజువాకలో వైకాపా నేతల అక్రమాలపై చర్యలు తీసుకోండి'

గాజువాక వైకాపా నేతలు విచ్చలవిడిగా భూ అక్రమణలకు పాల్పడుతున్నారని ఆ ప్రాంత తెలుగు యువత నేతలు ఆరోపించారు. వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

telugu yuvatha leaders
telugu yuvatha leaders

గడిచిన 16 నెలలుగా విశాఖ జిల్లా గాజువాక వైకాపా నేతలు విచ్ఛలవిడిగా భూ అక్రమణలకు పాల్పడుతున్నారని ఆ ప్రాంత తెలుగుయువత ఇంఛార్జ్ మెుల్లి పెంటిరాజు ఆరోపించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినప్పటికీ స్థానిక తహసీల్దార్​లు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహించారు. వైకాపా నేతలకు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details