ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వంగలపూడి అనిత - parishath elections in andhrapradhesh

పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెదేపా విడుదల చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ నేత వంగలపూడి అనిత అన్నారు. ఎన్నికల రీ-నోటిఫికేషన్​ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చేతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని కీలుబొమ్మలా మారారని అనిత ఆరోపించారు.

tdp-leader-vangalapoodi-anitha
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత

By

Published : Apr 3, 2021, 7:33 PM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే అప్రజాస్వామికంగా ఎన్నికల నోటిఫికేషన్​ను జారీ చేసిన ఎస్ఈసీ నీలం సాహ్ని.. సీఎం జగన్ చేతిలో కీలుబొమ్మలా మారారని ఆరోపించారు.

పరిషత్ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకముంటే రీ-నోటిఫికేషన్ విడుదల చేయాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. నామినేషన్లు సక్రమంగా వున్నప్పటికీ తెదేపా అభ్యర్ధుల నామినేషన్లను అధికారులు తిరష్కరించారని ఆమె విమర్శించారు. తగిన సమయంలో వైకాపాకు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.

ఇదీచదవండి.

తిరుపతికి పవన్.. రత్నప్రభ తరఫున ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details