ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి' - విశాఖ జిల్లా తాజావార్తలు

ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని.. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tdp followers protest in vishakapatnam
తెదేపా నాయకుల నిరసన

By

Published : Dec 19, 2020, 9:29 PM IST

తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు చేస్తున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ..విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిపై దాడికి యత్నించిన వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details