ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు?'

By

Published : Jul 20, 2020, 8:22 PM IST

రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగినపుడు సీఎం జగన్ ఎందుకు స్పందించరని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగల పూడి అనిత ప్రశ్నించారు. మైనర్ పై అత్యాచారం చేసి నిందితులు పోలీసుస్టేషన్ ఎదుట వదిలేస్తే.. వారిని పట్టుకోలేకపోయవడం సిగ్గుచేటన్నారు.

tdp anitha
tdp anitha

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగల పూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ప్రభుత్వం చేత కాకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రాజమహేంద్రవరంలో మైనర్ పై అత్యాచారం చేసి నిందితులు పోలీసుస్టేషన్ ఎదుట వదిలేస్తే.. నిందితుడిని పట్టుకోలేకపోవవడం దారుణమన్నారు. ఈసీ విషయంలో బయటకు వచ్చిన సీఎం.. ఆడపిల్లలకు అన్యాయం జరిగినపుడు ఎందుకు స్పందించరని అనిత ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details