ఇటీవల విశాఖ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నాతవరం మండలం తాండవ జలాశయం నీటిమట్టం మూడు అడుగుల మేర పెరిగింది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా... ప్రస్తుతం 374 అడుగులకు చేరింది. నీటిమట్టం ఆశాజనకంగా ఉండటం వల్ల ఖరీఫ్ కాలానికి సంబంధించి నీటిని విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూలై నెలలో ఎండలు ముదిరితే... ఆగస్టు 5 లేదా 10 తారీఖుల్లో నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
స్వల్పంగా పెరిగిన తాండవ జలాశయం నీటిమట్టం - visakha district latest news
విశాఖ తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు తాండవ జలాశయం నీరు అందిస్తోంది. ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ జలాశయంలో మూడు అడుగుల నీటిమట్టం పెరిగింది. దీంతో రైతులకు సకాలంలో నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
![స్వల్పంగా పెరిగిన తాండవ జలాశయం నీటిమట్టం tandavar reservoir water level increases in visakha district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8113790-369-8113790-1595335047200.jpg)
తాండవ నదిలో పెరిగిన నీటిమట్టం