ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుళ్ల సీతారామపురం ఆలయాన్ని దర్శించిన స్వాత్మానందేంద్ర

విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి భావోద్వేగానికి గురయ్యారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో ఉన్న ఆయన.. ఓ ఆలయ దుస్థితి చూసి ఆవేదన చెందారు.

By

Published : Mar 24, 2021, 9:52 AM IST

Swatmanandendra Swami
గుళ్ల సీతారామపురం ఆలయ దుస్థితిపై స్వాత్మానందేంద్ర స్వామి భావోద్వేగం

శ్రీకాకుళం జిల్లాలో గుళ్ల సీతారామపురంలోని ఆలయ దుస్థితిని చూసి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ఆవేదన చెందారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా.. ఈ ప్రాంతాన్ని చేరుకున్న స్వాత్మానందేంద్ర స్వామి దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

గుళ్ల సీతారామపురం ఆలయ దుస్థితిపై స్వాత్మానందేంద్ర స్వామి భావోద్వేగం

ఆలయానికి మూడు వేల ఎకరాలున్నా నిర్లక్ష్యానికి గురి కావడం బాధాకరం. ఈ భూముల్ని అన్యాక్రాంతం చేసిన వారికి నాశనం తప్పదు. ఆక్రమించుకున్న భూముల్ని అలయానికి తిరిగి అప్పగించాలి. ఈ దేవాలయ దుస్థితిపై దేవాదాయ శాఖతో చర్చిస్తాము. శ్రీరామనవమి వేడుకలకు విశాఖ శారదాపీఠం తరపున పట్టువస్త్రాలను పంపుతాం. అలాగే సీతారాములకు వెండి కిరీటాలను చేయిస్తాము.

_శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి

ఇదీ చదవండీ..విమానాశ్రయాన్ని తలపిస్తున్న కర్నూలు రైల్వేస్టేషన్

ABOUT THE AUTHOR

...view details