ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హిందూ ధార్మిక పరిషత్​ను ఏర్పాటు చేయాలి' - శార‌దాపీఠాధిప‌తి వార్తలు

రాష్ట్రంలో హిందూ ధార్మిక పరిషత్​ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్​ను స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. ఇటీవ‌ల దేవాలయాలపై జరిగిన పరిణామాలపై దేవాదాయ శాఖ తరఫున పీఠాధిపతులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

swaroopanandendra saraswati requsted cm Jagan
'హిందూ ధార్మిక పరిషత్​ను ఏర్పాటు చేయాలి'

By

Published : Feb 17, 2021, 9:56 PM IST

రాష్ట్రంలో ఇటీవ‌ల దేవాల‌యాల‌పై చోటుచేసుకున్న ప‌రిణామాలపై దేవాదాయ శాఖ‌ త‌రుఫున పీఠాధిప‌తుల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని... శార‌దాపీఠాధిప‌తి స్వరూపానందేంద్ర స‌ర‌స్వతి ముఖ్యమంత్రి జ‌గ‌న్​మోహ‌న్ రెడ్డిని కోరారు. శార‌దాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గోనేందుకు వ‌చ్చిన సీఎం వద్ద ప‌లు కీల‌క అంశాల‌ను ప్రస్తావించారు. హిందూ ధార్మిక పరిషత్​ను ఏర్పాటు చేయాలని సూచించారు. వారసత్వ అర్చకత్వం పూర్తిస్థాయిలో అమలు కావడంలేద‌ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించిన‌ట్లు పీఠం వ‌ర్గాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details