'స్వామి వివేకానంద' జయంతిని పురస్కరించుకొని విశాఖలో చిత్రలేఖనం పోటీలు జరిగాయి. వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా విద్యార్థులు చిత్రాలు వేశారు. నేటి నుంచి 18 రోజుల పాటు 'స్వామి వివేకానంద' జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు వచ్చే నెల 5న బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిత్రలేఖనం పోటీలు - swami vivekananda jayanthi news in visakhapatnam
హిందూమతం గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసిన 'స్వామి వివేకానంద' జయంతిని పురస్కరించుకొని... విశాఖలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. నేటి నుంచి 18 రోజుల పాటు స్వామి వివేకానంద జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

విశాఖలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిత్రలేఖనం పోటీలు
విశాఖలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిత్రలేఖనం పోటీలు
ఇదీ చూడండి: ఆంధ్ర వర్శిటీలో 'ఐడల్'.. ఉర్రూతలూగించిన నృత్యాలు