ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. బావిలో మృతదేహం - నేళ్తేరు గ్రామంలో అనుమానాస్పద మృతి

విశాఖ జిల్లా నేళ్తేరు గ్రామంలో ఓ వ్తక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బావి గట్టుపైన సూసైడ్ లెటర్, షర్ట్, చరవాణి, బైక్ తాళాలు గుర్తించిన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

suspicious death
బావిలో పడి ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

By

Published : Jan 6, 2021, 8:28 AM IST

విశాఖ జిల్లా ఆనందపురం మండలం నేళ్తేరు గ్రామానికి చెందిన పాండ్రంకి సూర్యనారాయణ (46).. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన.. బావిలో మృతదేహంగా తేలాడు. బావి గట్టు మీద.. సూసైడ్ లెటర్, షర్ట్, మొబైల్ ఫోన్, బైక్ తాళాలను పోలీసులు గుర్తించారు.

తన చావుకు బంక సూర్య నారాయణ, అల్లుడు చిన్నంనాయుడు అని మృతుడి స్వదస్తూరితో రాసినట్టుగా ఉన్న సూసైడ్ లెటర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details