ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దిల్లీలో ఆగస్టు 2, 3న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిరసన

By

Published : Jul 23, 2021, 12:34 PM IST

దిల్లీలో జాతీయ, ప్రాంతీయ పార్టీల ముఖ్య నాయకులను .. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ  నేతలు కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని..వారిని కోరారు. దిల్లీలో ఆగస్టు 2, 3 తేదీల్లో కార్మికులు  చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

Steel Plant Conservation Committee protest at august in  delhi
దిల్లీలో ఆగస్టు 2, 3న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిరసన

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్​ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని.. దిల్లీలో జాతీయ, ప్రాంతీయ పార్టీల ముఖ్య నాయకులను స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కలిశారు. ఎంపీ విజయసాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత పవన్​కుమార్ బన్సాల్, సీపీఐ జాతీయ నేత రాజా, సీపీఎం జాతీయ నేతలు సీతారామ్ ఏచూరి, రాఘవులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్​లతో.. జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకుడు అమృత్ కౌర్, సీపీఐ నాయకుడు కన్నయ్య కుమార్ మాట్లాడారు.

దిల్లీలో ఆగస్టు 2, 3 తేదీల్లో కార్మికులు చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని.. స్టీల్ ప్లాంట్​ను ప్రభుత్వంలో కొనసాగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మరో రెండు రోజులు దిల్లీలో ఉండి అనేకమంది ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను నాయకులను కలుస్తామని వారు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details