కొయంబేడు నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా: ఎస్పీ
విశాఖ గ్రామీణ జిల్లాలో కరోనా ప్రబలకుండా పోలీస్ పరంగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాబుజీ తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాబుజీ అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ నుంచి పాల్గొన్నారు. జిల్లాలో కొయంబేడు నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆయన వివరించారు. ఇప్పటికీ ఆ ప్రాంతం నుంచి మంది విశాఖ జిల్లా వచ్చారని... వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి నెగిటివ్ వచ్చిందని మిగిలిన పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందన్నారు. అనకాపల్లిలోని దిశ పోలీస్ స్టేషన్ పనీతీరు బాగుందని సీఎం కితాబు ఇచ్చినట్లు వివరించారు.