తమ ఉనికిని చాటుకునేందుకు యాక్షన్ టీంలను రంగంలోకి దించి... భౌతిక దాడులు చేయడానికి మావోయిస్టులు యోచిస్తున్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. నిఘా వర్గాలు నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యాయి. తనిఖీలు ముమ్మరం చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఈ తరుణంలో మావోయిస్టుల కదలికలను కట్టడి చేసేందుకు ఏజెన్సీలోని 11 మండలాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీకి వచ్చే ప్రతీ మార్గంలోనూ పోలీసులు వాహనాలను, వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. మరో పక్క ప్రత్యేక పోలీసు బలగాల బృందాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ... అనుమానితులను పరిశీలించే పని చేపట్టాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారిపై పోలీసులు నిఘా పెంచారు.