విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం నుంచి ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ... ఎన్ఏడీ పైవంతెన వద్ద అదుపుతప్పింది. విభాగినిపైకి దూసుకుపోయి అటుగా వస్తోన్న ఆటోపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా... ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు... సహాయక చర్యలు చేపట్టారు. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ ఎన్ఏడీ వంతెనపై ప్రమాదం... ఆరుగురికి గాయాలు - vizag crime
విశాఖపట్నం ఎన్ఏడీ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ... అదుపు తప్పి విభాగిని ఎక్కి ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వల్వ గాయాలయ్యాయి.

విశాఖ ఎన్ఏడీ పై వంతెనపై ప్రమాదం