రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఆరుగురు అరెస్టు: డీజీపీ - రేవ్ పార్టీ డ్రగ్ కేసు
విశాఖ రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామని... ఐదుగురు డ్రగ్ సప్లయర్స్ ఉన్నట్లు గుర్తించామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.
![రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఆరుగురు అరెస్టు: డీజీపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3214944-187-3214944-1557227832337.jpg)
విశాఖ రేవ్ పార్టీ డ్రగ్ కేసు విషయంలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామన్న డీజీపీ... ప్రస్తుతానికి ఐదుగురు డ్రగ్ సప్లయర్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వందమంది డ్రగ్స్ వినియోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. ఈ కేసులో కొంతమంది పెద్దలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని... వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి ఓ ప్రత్యేకత ఉందని... ఆ పేరును పాడు చేయాలని చూస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. డ్రగ్స్కు సంబంధించి ఏ సమాచారమున్నా 75693 09090 అనే నంబర్కు తెలియజేయాలని కోరారు. విశాఖలో రూ.1.6 కోట్లతో నిర్మించిన ఎంవీపీ మోడల్ పోలీస్స్టేషన్ను డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.