ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 15, 2020, 4:20 PM IST

ETV Bharat / state

కళ్యాణపులోవ జలాశయం ఆరు గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నం జిల్లా కళ్యాణపులోవ జలాశయం జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

six gates opened of kalyanapulova dam in vizag district
కళ్యాణపులోవ జలాశయం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నం జిల్లా రావికమతం మండలంలోని కళ్యాణపులోవ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 459 .5 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details