విశాఖ సింహాచల దేవస్థాన కాటేజీలో ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా నాలుగు నెలలుగా ఉంటున్న ఛైర్మన్ సంచయిత వ్యక్తిగత సహాయకుడు సౌందర్యరాజన్ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఛైర్మన్, ఈవోలు ఇద్దరూ ఖాళీ చేయాలని ఉత్తర్వులిచ్చినట్లు దేవస్థాన సిబ్బంది వెల్లడించారు. దీనిపై కమిషనర్ కార్యాలయానికి సమాచారమిచ్చినట్లు సిబ్బంది చెప్పారు. అనధికారికంగా దేవస్థాన కాటేజీలో ఎందుకు ఉంటున్నారని సౌందర్యరాజన్ను ప్రశ్నిస్తే....ఆ విషయం దేవస్థాన అధికారులను అడగాలని ఆయన బదులిచ్చారు.
సింహాగిరి వివాదం: సౌందర్యరాజన్ను పంపించేందుకు ప్రయత్నాలు..! - వైజాగ్ వార్తలు
విశాఖ సింహాద్రి అప్పన్న దేవస్థానం వివాదాలకు అడ్డాగా నిలుస్తోంది. దీంతో దేవస్థాన కాటేజీలో అనధికారికంగా ఉంటున్న ఛైర్మన్ సంచయిత వ్యక్తిగత సహాయకుడు సౌందర్యరాజన్ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
![సింహాగిరి వివాదం: సౌందర్యరాజన్ను పంపించేందుకు ప్రయత్నాలు..! simhachalam-temple-controversy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8686600-220-8686600-1599289244100.jpg)
సింహాగిరి వివాదం
ఇదీ చదవండి:సింహగిరిపై మరో కొత్త వివాదం... !