ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదలో కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు - Cause Way damaged news today

విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద శారదా నదిపై ఉన్న కాజ్ వే వరద ఉద్ధృతికి పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం రైవాడ జలాశయం గేట్లు ఎత్తి అదనపు నీటిని శారదా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఉగ్రరూపంతో ప్రవహిస్తున్న శారదా నదిపై ఉన్న కాజ్ వే పూర్తిగా కొట్టుకుపోయింది.

వరదలో కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు
వరదలో కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు

By

Published : Oct 14, 2020, 7:23 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద శారదా నదిపై ఉన్న కాజ్ వే వరదనీటి ఉద్ధృతికి బుధవారం పూర్తిగా కొట్టుకుపోయింది. రైవాడ జలాశయం గేట్లు ఎత్తి అదనపు నీటిని శారదా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రరూపంతో ప్రవహిస్తున్న శారదా నదిపై ఉన్న కాజ్ వే కొట్టుకుపోయింది.

కాజ్ వే పనులకు మరమ్మతులు..

నదికి అటు వైపున దేవరాపల్లి, అనంతగిరి, హుకుంపేట మండలాలకు చెందిన దాదాపు 100 వరకు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి కాజ్ వే పనులకు మరమ్మతులు చేపట్టాలని... నదిపై అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజల కోరుతున్నారు.

ఇవీ చూడండి:

బలపడి.. మళ్లీ వాయుగుండంగా..!

ABOUT THE AUTHOR

...view details