ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 27, 2021, 10:13 PM IST

ETV Bharat / state

gavarapeta villegers facing problem to cross river: నది దాటేందుకు దోనెలే దిక్కాయె.. బ్రిడ్జి నిర్మించేదెన్నడో?

పొలాల దగ్గరికి వెళ్లాలంటే... ప్రాణాలు ఫణంగా పెట్టి.. తీగ పట్టుకు వేళాడుతూ నది దాటాల్సిందే.. అదుపు తప్పితే అంతే సంగతులు..! ఇదీ.. విశాఖ జిల్లా శారదానది పరీవాహక గ్రామల ప్రజల దుస్థితి. వంతెన నిర్మాణం ముందుకు సాగకపోవడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నది దాటేందుకు అవస్థలు
నది దాటేందుకు అవస్థలు

నది దాటేందుకు అవస్థలు

gavarapeta villegers :విశాఖ జిల్లా కశింకోట పరిధిలో.. గవరపేట నుంచి శారదానది అవతలి ఒడ్డుకు నిత్యం 200 మంది రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు.. 12 వందల ఎకరాల పంట భూములు, పశువుల కళ్లాలు.. నదికి అవతలే ఉన్నాయి. అయితే.. ఈ ప్రవాహం దాటేందుకు తాటిచెట్లతో చేసిన దోనెలనే ఉపయోగిస్తున్నారు. రైతులంతా కలిసి ఈ తాటి దోనె నడిపేందుకు ఓ కుటుంబ౦తో ఒప్పందం చేసుకుని.. ఏటా డబ్బు చెల్లిస్తుండడం గమనార్హం.

రైతులతో పాటు పశువులనూ.. ఈ దోనె సాయంతోనే శారదానది దాటిస్తుంటారు. కాగా.. రైతుల అవస్థలు తొలగించేందుకు ఎట్టకేలకు వంతెన మంజూరైంది. దాని నిర్మాణానికి నదిలో కొన్ని పిల్లర్లు కూడా వేశారు. దీంతో.. ఇక కష్టాలు తొలిగినట్టేనని స్థానికులు ఆనందించారు.

కానీ.. ఆ తర్వాత నుంచి పనుల్లో జాప్యమవుతోంది. నిధుల కొరత వచ్చి పడడంతో.. ఎప్పుడు పూర్తువుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. నదిలో వరద ప్రవాహం పెరగడంతో.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంభయంగానే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా నేతలు స్పందించి, వంతెన నిర్మాణంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

'సీఎంగా జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదు'

ABOUT THE AUTHOR

...view details