ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 9, 2020, 3:30 AM IST

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారుల దాడులు

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం గొప్పూరులో నాటుసారా కేంద్రాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబి అధికారుల దాడులు
నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబి అధికారుల దాడులు

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం గొప్పూరులో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు... ఎస్​ఈబీ సీఐ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నాటుసారా తయారీకి ఉపయోగించే 1600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details