ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బజ్జీ మిర్చి పంటను కొనాలంటూ రోడ్డెక్కిన గిరి రైతులు

By

Published : Sep 24, 2020, 5:46 PM IST

Updated : Sep 24, 2020, 7:24 PM IST

విశాఖ జిల్లా అరకులోయ ప్రాంతంలో బజ్జీ మిర్చి సాగు చేసిన రైతులను ఆదుకోవాలని సీపీఎం ఆందోళన చేపట్టింది. కరోనా కారణంగా సాగు చేసిన మిర్చిని కొనేందుకు వ్యాపారులెవరూ ముందుకు రావట్లేదని మండిపడింది. ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది.

బజ్జీ మిర్చి పంటను కొనాలంటూ రోడ్డెక్కిన గిరి రైతులు
బజ్జీ మిర్చి పంటను కొనాలంటూ రోడ్డెక్కిన గిరి రైతులు

విశాఖ జిల్లా అరకులోయ చినలబుడు పంచాయతీ పరిధిలో సుమారు 300 ఎకరాల్లో గిరి రైతులు బజ్జీ మిర్చిని సాగు చేశారు. కరోనా లాక్​డౌన్ కారణంగా మిర్చి కొనేందుకు వ్యాపారులెవరూ సుముఖత చూపట్లేదని సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు.

ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా..

విశాఖపట్నం మిర్చి మార్కెట్​కు పంటను తరలించి వెంటనే తమను ఆదుకోవాలని రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదని సీపీఎం నేతలు మండిపడ్డారు. ఫలితంగా 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని సీపీఎం నాయకుడు బాల్​దేవ్ వివరించారు.

సర్వే చేపట్టినా.. పరిహారం ఇవ్వలేదు...

నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అధికారులు సర్వే చేపట్టినా.. ఎలాంటి పరిహారం అందలేదన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.

బజ్జీ మిర్చి పంటను కొనాలంటూ రోడ్డెక్కిన గిరి రైతులు

ఇవీ చూడండి : ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్ బాధితుడి మృతి.. బంధువుల ఆందోళన

Last Updated : Sep 24, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details