ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 7, 2020, 3:05 PM IST

ETV Bharat / state

నాటుబళ్లపై అక్రమంగా ఇసుక తరలింపు.. ఇద్దరిపై కేసు

ఇసుకకు రోజురోజుకు డిమాండ్ పెరగుతోంది. ఇదే.. అక్రమార్కులకు అడ్డదారులు కల్పిస్తోంది. నది నుంచి ఇసుకను నాటుబళ్లపై అక్రమంగా తరలిస్తుండగా విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి పోలీసులు పట్టుకున్నారు.

sand illegal transport
sand illegal transport

విశాఖపట్నం.. దేవరాపల్లి మండలం బొడ్డేరు నది నుంచి తిమిరాం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు నాటుబళ్లపై తారువ గ్రామానికి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇసుక బళ్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details