ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కూలీలు సొంతగూటికి వెళ్లేందుకు... సమాలోచన ట్రస్టు సాయం - అనకాపల్లిలో సమాలోచన భాష ఛారిటబుల్ ట్రస్టు సాయం

లాక్​డౌన్ వలసకూలీలపై తీవ్రప్రభావం చూపుతోంది. ఉపాధి లేక, తిండిలేక..ఇంటికి వెళ్లాడానికి వీలులేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లానుంచి 25 మంది బీహార్ వలసకూలీలు కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వీరిని గుర్తించిన సమాలోచన భాష ఛారిటబుల్ ట్రస్టు..ఇంటికెళ్లేందుకు రవాణా సదుపాయాన్ని కల్పించింది.

samalochana   bhasha charitable  trust assistance to bihar  migrant laborers in anakapalli
అనకాపల్లిలో బీహార్ వలసకూలీలు

By

Published : May 31, 2020, 10:44 PM IST

పొట్ట చేత పట్టుకొని బిహార్ నుంచి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వచ్చిన బిహార్​ వలస కార్మికులు 25 మంది... కాలినడకన స్వగ్రామానికి బయలుదేరారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వీరికి దాతలు సాయం అందించారు. జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వీరిని గుర్లతించి.. సమాలోచన బాషా స్వచ్ఛంద సంస్థ సభ్యులు భోజన వసతి ఏర్పాటు చేశారు.

ఆ 25 మంది వలస కార్మికులను ఇంటికి పంపేందుకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తామని సంస్థ సభ్యులు డాక్టర్. శశిధర్ తెలిపారు. వారందరికీ అవసరమైన పరీక్షలు నిర్వహించి ...అన్ని అనుమతులతో బిహార్​లోని వారి గ్రామాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details