ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్థలాల మంజూరులో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు' - ఇళ్ల స్థలాల ఎంపికలో వైకాపా అక్రమాలకు పాల్పడుతుంది'

ఇళ్ల స్థలాల ఎంపికకు సంబంధించి అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని తెదేపా శ్రేణులు విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో ఫిర్యాదు చేశారు.

vishaka district
ఇళ్ల స్థలాల ఎంపికలో వైకాపా అక్రమాలకు పాల్పడుతుంది'

By

Published : Jul 13, 2020, 6:10 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో ఇళ్ల స్థలాల ఎంపికలో వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. మండల తెలుగు యువత నాయకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో.. తహసీల్దార్ త్రివేణికి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

సచివాలయ ఉద్యోగులు, అధికార పార్టీ నేతల బంధువులకే ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలు వెలికి తీయాలని తహసీల్దార్​ను కోరారు.

ABOUT THE AUTHOR

...view details