విశాఖ జిల్లా యస్ రాయవరం అడ్డురోడ్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో ప్రయాణిస్తున్న ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ సమీప గ్రామాలైన గోకులపాడు, దార్లపూడిలకు చెందిన వారు. రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీకొన్న టిప్పర్- 8మందికి తీవ్ర గాయాలు - యస్. రాయవరంలో రోడ్డు ప్రమాదం
యస్. రాయవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-టిప్పర్ లారీ ఢీకొని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులందరూ సమీప గ్రామాలకు చెందినవారిగా పోలీసులు తెలిపారు.
![ఆటోను ఢీకొన్న టిప్పర్- 8మందికి తీవ్ర గాయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3174435-667-3174435-1556844193811.jpg)
టోను ఢీకొన్న టిప్పర్- 8మందికి తీవ్ర గాయాలు