ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 25, 2021, 10:45 AM IST

ETV Bharat / state

ద్విచక్ర వాహనాలు ఢీ.... నలుగురికి గాయాలు

విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుకొండ వద్ద రెండు ద్విచక్రవహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదానికి గురైన ద్విచక్రవాహనం
ప్రమాదానికి గురైన ద్విచక్రవాహనం

విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుకొండ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న రాత్రి నిండుకొండలోని గౌరమ్మ సంబరాలు చూసేందుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

గాయపడిన వారిని.. నిండుకొండకు చెందిన రాజేష్, ప్రవీణ్ కుమార్​, నర్సీపట్నానికి చెందిన అప్పలనాయుడు, రాజబాబుగా గుర్తించారు. వీరిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసును రోలుగుంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details