ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 26, 2020, 10:11 AM IST

ETV Bharat / state

లారీ, కారు ఢీ... ముగ్గురికి తీవ్ర గాయాలు

లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో చోటుచేసుకుంది.

road accident in makavarapalem
రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం సెట్టిపాలెం ఏలేరు కాలువ సమీపంలో లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. లారీ విశాఖ వైపు నుంచి నర్సీపట్నం వస్తుండగా... నర్సీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ఢీకొన్నాయి. మాకవరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details