బియ్యం బస్తాలను పంపిణీ చేసిన ఎంపీ - rice bags distributed by mp satyanarayana at vishakapatnam
లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కళాకారులకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసటగా నిలిచారు.

బియ్యం బస్తాలను పంపిణీ చేసిన ఎంపీ
విశాఖలో లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురైనా సింగర్స్, మెజిషియన్స్ వంటి ఇరవై మంది కళాకారులకు పార్టీ ఆఫీస్లో ఎంపీ ఐదు కేజీల బియ్యం బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ... తమకి అనేక సందర్భాల్లో సాయం అందిస్తున్న ఎంపీ సత్యనారాయణకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ... కళాకారులకు చేయూతనివ్వడం తమ బాధ్యత అన్నారు.