నిధులు దుర్వినియోగంపై గ్రామస్థులు గత నెల 30న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 'అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం' అనే శీర్షికతో ఈటీవీభారత్లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి విశాఖ జాయింట్ కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంలో అధికారులు విచారణ చేపట్టారు. మాజీసర్పంచ్, కార్యదర్శి గత ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని డీఎల్పీఓ కొండలరావు తెలిపారు.
'ఈటీవీభారత్' కథనానికి స్పందన... నిధుల దుర్వినియోగంపై విచారణ - visakha latest unusage of funds
ఈటీవీ భారత్ కథనానికి విశాఖ జాయింట్ కలెక్టర్ స్పందించారు. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంలో అధికారులు విచారణ చేపట్టారు.
!['ఈటీవీభారత్' కథనానికి స్పందన... నిధుల దుర్వినియోగంపై విచారణ respond to bharat story inquiry on sarpanch in visakha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5293959-437-5293959-1575653994515.jpg)
విచారణ చేస్తున్న అధికారులు