విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలోని రెడ్డి వారి వీధిలో రెడ్ జోన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో రక్షణ చర్యలు చేపడుతున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ వీధికి హైదరాబాద్ నుంచి ఓ యువకుడు వచ్చాడు. అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆ ప్రాంతంలోని రెడ్డి వారి వీధితోపాటు... అన్నివైపులా సుమారు 200 మీటర్ల దూరం వరకు కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. మరోపక్క వైద్య శిబిరం కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ పనులు చేపడుతున్నారు.
కరోనా ఎఫెక్ట్: నర్సీపట్నంలో కొనసాగుతున్న రెడ్జోన్ - విశాఖలో రెడ్జోన్ ప్రాంతాల వార్తలు
నర్సీపట్నంలోని పలు చోట్ల రెడ్జోన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య, మున్సిపాలిటి సిబ్బంది నిరంతరం ఆయా ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు.
![కరోనా ఎఫెక్ట్: నర్సీపట్నంలో కొనసాగుతున్న రెడ్జోన్ red zone in narsipatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7610473-548-7610473-1592120832864.jpg)
నర్సీపట్నంలో పలు చోట్ల కొనసాగుతోన్న రెడ్జోన్