ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 31, 2020, 5:33 AM IST

ETV Bharat / state

ఏడేళ్ల బాలుడ్ని మింగేసిన క్వారీ గుంత

పొలంలోకి పశువులను మేతకు తీసుకెళ్లిన ఓ బాలుడు.. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో జారి పడి మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన విశాఖ జిల్లా డి.అగ్రహారంలో చోటు చేసుకుంది.

ఏడేళ్ల బాలుడ్ని మింగిన క్వారీ గుంత
ఏడేళ్ల బాలుడ్ని మింగిన క్వారీ గుంత

విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం డి.అగ్రహారంలో లెక్కల వెంకట సత్యం, మాధవి దంపతులు వ్యవసాయ కూలీలు. వారికి ఏడేళ్ల బాబు, ఐదేళ్ల బాలిక ఉన్నారు. స్థానికంగా పాఠశాలలు లేకపోవడంతో ఏడేళ్ల కుమారుడు మనోజ్..​ పశువుల కాపరిగా మారాడు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. కుమారుడు పశువులను కాసేందుకు వెళ్లాడు.

క్వారీ గుంత వద్దకు..

ఈ క్రమంలో ఆవులు మేతమేస్తూ క్వారీ గుంత వద్దకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మనోజ్.. ఆవుల కోసం వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు క్వారీ గుంత నీటిలో జారిపడి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు క్వారీ గుంతలో పడి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి : పెరుగుతున్న కడుపుకోతలు.. విశ్వాసాలే కారణమా?

ABOUT THE AUTHOR

...view details