ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం పంపిణీ

అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందించే నాణ్యమైన బియ్యం కార్యక్రమాన్ని అనకాపల్లిలో ఎమ్మెల్యే గుడివాడ అమర్​ నాథ్​ ప్రారంభించారు.

By

Published : Jun 5, 2020, 12:02 AM IST

అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం పంపిణీ
అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం పంపిణీ

అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నామని విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందించే నాణ్యమైన బియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గర్భిణీ, బాలింతలకు పప్పు, నూనె, కోడిగుడ్లను అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులతో పాటు ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ అధికారిని మేరీ సువార్త పాల్గొన్నారు.

ఇదీ చూడండి:చేపలు వలలోకి.. భద్రత గాలిలోకి..

ABOUT THE AUTHOR

...view details